14. శ్రీరామవిజయము
ఇందులో చిత్రంగా రావణుడు లోహితాక్షుడనే దూతను రామునివద్దకి పంపించి పరశురాముడిచ్చిన పరశువును తనకిస్తే సీతను రామునికి యిచ్చివేస్తానని కబురుచేస్తాడు.
శ్రీరామచంద్రమూర్తి అదివిని -
దేయోనైష హర ప్రసాద పరశుః -తేనా ధికం తామ్యతి। - అని
యద్వాచ్యః స దశాననో మమగిరా దత్తా ద్విజేభ్యో మహీ।
తుభ్యం బ్రూహి రసాతలం బలభిదే నిర్జిత్య కిం దీయతామ్?
అంటే,
‘నామాటగా రావణునికి చెప్పు దానినివ్వడం కుదరదని. ఎందుకంటే భూమిని బ్రాహ్మణులకిచ్చేను. కోరితేరసాతలాన్ని నీకిచ్చేస్తాను. నిన్ను జయిస్తే గాని ఇంద్రునికి స్వర్గాన్ని ఇవ్వడంకుదరదుకదా ' - అని.
ఇలా చెప్పి హనుమద్వజచిహ్నితమైన రథాన్నధిరోహించి యుద్ధానికి సన్నద్ధుడైన రాముని చూచి రావణుడు -
న్యక్కారోహ్యయమేవ మే యదరయః తత్రాప్యసౌ తాపసః
సోప్యత్రైవ నిహన్తి రాక్షసకులం జీవత్యహో రావణః
ధిర్ధిక్ శక్రజితం ప్రబోధితవతా కిం కుంభకర్ణేనవా ?
స్వర్గగ్రామటికా విలుంఠనపరైః పీనైః కిమేతైర్భుజైః ?
రావణుని పరితాపాన్ని చూచిన మందోదరి తానే వీరపత్నిగా రణరంగంలో ప్రవేశిసానంటుందిలా -
శ్లో ॥ శోకం లంకేశ! మాగాః కురుచిరమపునర్మాం విగూఢాపగూఢామ్ ।
దేవాజ్ఞాం దే హి యుద్ధం సమరమవతరామ్యస్మి సుక్షత్రియా యత్ ||
– అని ఆమెను వారిస్తాడు. రామునితో తలపడతాదు. చివరకు మరణిస్తాడు।
ఇదే సందర్భంలో యుద్ధభూమిలో రావణుని కోదణ్ణా నధిరోహించిన నీలుణ్ణి వర్ణించే సందర్భంలో సమస్యాపూరణపద్యం -
యదా నీలో లంకాధిప సుభట కోదణ్డశిఖరే
స్థితఃచఞ్చద్భాష్పాకలితమృగతృష్ణాన్విత గిరిః
తదైవం దేవానాం మతిరజని దిఙ్మణలజుషాం
ధనుఃశృంగే భృంగః తదుపరి గిరిస్తత్రజ్ఞలధిః ||
ఎప్పుడైతే ప్రకాశిస్తున్న ఆసురకాంతల కన్నీటి ప్రవాహములాయన్నట్లున్న మృగతృష్టికలవంటి జల ప్రవాహసమ న్వితమైన ప్రస్రవణపర్వతాన్ని చేతధరించిన నీలుడు రావణుని
కోదణ్డాగ్రమునధిష్ఠించేడో, వాణ్ణిచూస్తున్న దేవతాసమూహాలకిలా అనిపించింది - ‘ధనుఃశృంగే భృంగః తదుపరి గిరిస్తత్రజ్ఞులధిః || ’ - అని
రామబాణం
శ్లో॥ యో రామో న జఘాన వక్షసి రణే తం రావణం సాయకైః
స శ్రేయో విదధాతు వస్త్రిభువనవ్యాపారచింతాపరః
హృద్యస్య ప్రతివాసరం వసతి సా తస్యాస్త్వహం రాఘవో
మయ్యాస్తే భువనవళీ విలసితా ద్వీపైస్సమం సప్తభిః ||
విధివిలాసం
జాతిరహ్మకులే అగ్రజో ధనపతిఃయః కుంభకర్ణోఽనుజః
పుత్రః శక్రజయీ స్వయం దశశిరాః పూర్ణా భుజా వింశతిః
దైత్యాః కామచరాః రథశ్చ విజయీ పారేసముద్రం గృహమ్
సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే ॥
ఇహఖలు విషమః పురాకృతానాం - భవతి హి జన్తుషు కర్మణాం విపాకః |
శివ శిరసి శిరాంసి యాని రేజుః - శివ శివ తాని లుఠన్తి గృధ్రపాదైః ||
సీతయొక్క అగ్ని ప్రవేశం (సమస్యాపూరణశ్లోకం)
వహ్నిం గతాయాః జనకాత్మజాయాః - ప్రోత్ఫుల్లరాజీవముఖం విలోక్య
ఉవాచ రామః కిమహో సురాదీన్ - అంగారమధ్యే జలజం ప్రఫుల్లమ్||
శ్రీరామచంద్రమూర్తి తనవద్దకు వచ్చిన మందోదరినిచూచి - ‘కిమాజ్ఞాపయతి మహాభాగా మందోదరీ?’ - అని నతశిరస్కుడై అడుగుతాడు. ఆమె ఆయనను ప్రశంసితుందిలా
శ్లో ॥ ధన్యా రామ! త్వయా మాతా ధన్యో రామ ! త్వయాపితా ।
ధన్యో రామ! త్వయా వంశః పరదారాన్నపశ్యసి ||
-అంటుంది.
రాక్షసులకు సహగమనం ఆచారంకాదుకావున ఆమె పూర్వరాజ్ఞిగా మర్యాదనందుతూ విభీషణాంతఃపురంలో రాజమాతతో సమానమైన గౌరవాన్ని పొందమని అభ్యర్థిస్తాడు శ్రీరామచంద్రమూర్తి.
చిత్రమైన ఘట్టం
శ్రీరామపట్టభిషేకం పూర్తవుతుంది. ఒక్క సారిగా అంగదుడు రామునకభిముఖంగా నిలచి -
శ్లో||సుగ్రీవేణాంజనేయ ప్రముఖ భటచమూచక్రవాలేనసార్థం
త్వామేకేనాంగదోఽహం పితృనిధనమనుస్మృత్య మధ్నామి దోష్ణా ॥
శ్లో॥ శ్రుత్వాంగదస్య మహతీం సమర ప్రతిజ్ఞాం -తే చుక్షుభుః కపిచమూపతయః సరామాః |
సౌమిత్రిరప్య నపరాధినమాహతం తం - మత్వా కృతాంజలిపుటః పురతో బభూవ ||
ఆకాశవాణి:
శ్లో || ఆకాశవాణ్యభవదేవ మహో స వాలీ - దాసో హనిష్యతి పునర్మధురావతారే।
శ్రుత్వా విలోక్య రఘునందనవానరాణాం -కారుణ్యమంజలిపుటం సరణా న్నివృత్తః ||
తరువాత హనుమ రాముని ఇలా స్తోత్రముచేస్తాడు:
అత్యుక్తో యది నప్రకుప్యసి మృషావాదం న చేన్మన్యసే
తద్రూమోద్భుతకీర్తనే రసనా కేషాం న కణ్ణూయతే ?
రామ! త్వత్తరుణప్రతాపదహనజ్వాలావళీ శోషితాః
సర్వే వారిధయస్తతో రిపువధూనేత్రాంబుభిః పూరితాః ||
తులసీదాసు:
ప్రభుప్రతాప బడబానల భారీ-సూఖా ప్రథమ పయోనిధి బారీ|
తవ రిపునా రి రుదనజల ధారా -భరేఉ బహోరి భయౌ తేహి 'ఖారా ' || (మానస్)
చివరగా భరతవాక్యం -
శ్లో || చతుర్దశభిరేవాంకైః భువనాని చతుర్దశ - శ్రీమహానాటకంధత్తే కేవలం బ్రహ్మ నిర్మలమ్||
ఇలా నాటకంసాంతం పరిచయమైనాక రాముని యెఱుక కలుగుతుంది.అందుకే ప్రయోజనం - శ్రీమహానాటకంధత్తే కేవలం బ్రహ్మ నిర్మలమ్ || అని చెప్పబడింది.
మానవజన్మ చారితార్ధ్యంకూడా ఇదేనని - ‘యస్తు రామం నపశ్యేత్తు….విగ్దరతి’-అనిచెప్పబడిందికదా !
శుభం భూయాత్