5. శ్రీరామ-వియోగ-విలాపము
ఇందులో – జటాయుసంస్కారం, శ్రీరామవిలాపం, సుగ్రీవమైత్రి, వాలివధ అనేవి ప్రధానాంశములు . సీతాపహరణసమయం చైత్రశుద్ధ అష్టమినాటి మధ్యాహ్నమ ని,చక్కగా చిన్న అనుష్టుప్పులో -
శ్లో ॥ అర్ధరాత్రే దినస్యార్ధి అర్ధచంద్రేర్ధభాస్కరే| రావణేన హృతా సీతా కృష్ణపక్షే సీతాష్టమీ ||
శ్రీరామచంద్రమూర్తి జటాయువుని స్వర్గానికి వీడ్కొలుపుతూ-
రామోఽహం యది తద్దినైః కతిపయైః వ్రీడా నమత్కంధరః-
అందుకునేను సిగ్గు పడాలిఅంటూనే
సార్ధం బంధుజనేన సేంద్రవిజయీ వక్తా స్వయంరావణః ||
-అంటాడు. తులసీదాసు ఈ భావాన్నిలానే వ్యక్తీకరిస్తాడు తన రామచరితమానస్ లో
శ్రీరామచంద్రమూర్తి సీతా విశ్లేషవిరహానుభవాన్నిలా అద్భుతంగా వర్ణిస్తాడు-
రామ విరహాన్ని వర్ణించే సందర్భంలోనే చక్కని శ్లోకం -
శ్లో ॥ చంద్రశ్చండకరాయతే, మృదుగతిర్వాతోఽపి వజ్రాయతే మాల్యంసూచికులాయతే మలయజో లేపాత్ స్ఫులింగాయతే రాత్రిః కల్పశతాయతే విధివశాత్రాణోపి భారాయతే హా హన్త! ప్రమదావియోగసమయః సంహారకాలాయతే||
తాత్పర్యము:
“ప్రియురాలి నుండి వియోగ సమయంలో ప్రకృతి యావత్తూ విపరీతమైన రూపాల్లో కనిపిస్తుంది:
- చంద్రుడు (సాధారణంగా శీతలమైనవాడు) చండకరుడు (ప్రచండ తాపమును కలిగించే మండే సూర్యుడు) లాగా కఠినంగా మారాడు.
- మృదువైన గాలి వజ్రాల (కత్తుల) లాగా నొప్పి కలిగిస్తుంది.
- పూలమాల సూదుల మాలగా మారింది.
- చందనపు లేపనం (శీతలం) భగ భగ మండుతున్న నిప్పురవ్వలా కాలుస్తున్నది.
- రాత్రి నూరు యుగాలుగా అనిపిస్తుంది.
- జీవిత రక్షణ కూడా భారమైపోయింది. అయ్యో! ప్రియతో వియోగం సంభవించిన ఈ సమయం, సంహారకాలంలా (ప్రళయకాలం) మారిపోయింది!”
సాహిత్య విశేషములు (సాహిత్య అంశాలు):
- విరోధాభాసం (పరస్పర విరుద్ధ భావన):
- చంద్రుడు “చండకరుడు” (మండే సూర్యుడు) అనడం, మృదువైన గాలి “వజ్రం” అనడం – సహజ గుణాలకు విరుద్ధమైన వివరణ.
- చందనం (శీతలం) “స్ఫులింగాయతే” (భగభగ మండే నిప్పురవ్వ) అనడం.
- అతిశయోక్తి :
- రాత్రిని “కల్పశతాయతే” (నూరు యుగాలు) గా చిత్రీకరించడం.
- ప్రేమికుల వియోగాన్ని “సంహారకాలం"తో సాటిపెట్టడం.
- రూపకాలంకారం:
- మాల్యం (పూలమాల) → సూచిక (సూదులు).
- విధివశాత్ రక్షణ → భారం.
- భావసాంద్రత:
- ప్రకృతి మూలకాలు (చంద్రుడు, గాలి, రాత్రి) ద్వారా మానసిక వేదనను ప్రతిబింబించడం.
సీతమ్మజారవిడిచిన ఆభరణాలను లక్ష్మణునికి చూపిస్తూ శ్రీరామచంద్రమూర్తి - ‘వత్స !లక్ష్మణ జానీషే పశ్య త్వమపి తత్త్వతః’-నాయనా లక్ష్మణా నీకూ తెలుసుకదా వీనిని తత్త్వదృష్టితో నీవుకూడా చూడవయ్యా అంటేలక్ష్మణుడు -
- అంటాడు.
ఇది వాల్మీకిననుసరించి వ్రాసినవైనం. ‘నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే। నూపురౌ త్వభిజానామి …’- అని వాల్మీకి.
వాలివధ - అద్భుతమైనఘట్టం.
శతకోటి ప్రవిస్తరమైన రామకథలో ఎక్కడి వృత్తాంతమోగాని సప్తతాళవృత్తాంతాన్ని కొత్తగా వర్ణిస్తాడు హనుమన్నాటకకర్త –
శ్రీరామచంద్రమూర్తి తనని చంపుతానని ప్రతిజ్ఞచెయ్యడం విన్నాడు వాలి. వెంటనే ఆదిశేషుని పృష్ఠమునుంచి పుట్టిన వంకరగానున్న సప్తతాళములను ప్రయోగించేడు. ఒకే బాణంతో వాని వంకరతీర్చిమరీ వాటిని ఛేదించాలి. అట్టి రణకోవిదుడే తనను వధించగలడు.లేకుంటే వానిచేతనతడు చంపబడతాడు. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణునికీవిషయం తెలియును. కావున అతడు వానిని పాదముతో నొక్కి వంకరతీర్చి, శ్రీరామచంద్రమూర్తి దివ్యాస్త్రముతో ఛేదించమంటాడిలా -
ఏకదైవ శరేణైకేన భిన్న కళేబరాః - మ్రియన్తే సప్తతాలాస్తంఘ్నంతి హన్తారమన్యథా
ఆవిధంగానే ఒకే ఒక్క బాణంతో శ్రీరామచంద్రమూర్తి వాటిని ఛేదించేసరికి, సప సంఖ్యాకములన్నీ భయపడినాయట!
‘అనిహతపితృశత్రుః కిం సశల్యో హతోస్మి’ - నాతండ్రికి శత్రువైన రావణుని చంపకుండాచచ్చిపోతున్నానే అని యేడ్చేడు.
వాలి రామసంవాదం
వాల్మీకానికి భిన్నంగా -
వాలి -
ప్రాయశ్చిత్తంగా
అలాగేనంటూ వాలి నేను నిన్ను చంపేదాకా నీకు స్వర్గతి ఉండదు నరకంలోనే ఉంటా ని శపిస్తాడిలా -
ఇవికాక ఎన్నెన్నో రసాలంకారస్ఫోరకాలైన శ్లోకాలు సాహి త్యదర్పణ, ధ్వన్యాలోకాది గ్రంథాలలో ఉధరింపబడినాయి. ఇవన్నీ రసగుళికల్లాంటి శ్లోకాలు.