ఏకవాక్యత

‘వేదః ప్రాచేతసాదాసీత్’ అని సంప్రదాయం.

‘వేదోఖిలో ధర్మమూలమ్’ - అని గౌతమస్మృతి.

‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా… ధర్మం పరమంవదన్తి’-అనిశ్రుతి.

కాబట్టి - ‘బీజం ధర్మద్రుమస్య ప్రభవతు భవతాం భూతయే రామనామ’ -ధర్మ తరుమూలమైన రామనామము మీకు శుభముల నిచ్చుగాక అనే మంగళాశాసనంతో ప్రథమాంకం ప్రారంభమవుతుంది.

రామనామమద్వయపరబ్రహ్మబోధకము –

నాయనాయ యదృతేక్షరాష్టకం పఞ్చమం నశివాయ యద్వినా । యద్వయం భవతి ముక్తి హేతవే తద్వయం వయముపాస్మహేఽద్వయమ్

ఏ అక్షరలోపము వలన “ॐ నమో నారాయణాయ” అష్టాక్షరీ మంత్రములో నారాయణాయ నాయనాయ గా పరిణమిస్తుందో ( రా ), ఏ అక్షరలోపము వలన “ॐ నమః శివాయ " అనే పంచాక్షరీ మంత్రములో నమః శివాయ నశివాయ గా పరిణమిస్తుందో ( మ ),

ఆ రామ అనే ముక్తినొసగే అక్షరద్వయమును మేము ధ్యానించెదము

‘…అని భావించి ఉపాసించాలి. అందుకే - ‘తెలిసి రామనామమును భజింపవే మనసా ! ‘ - అంటాడు త్యాగరాజస్వామి

ఆ ఎఱుకకోసమే రామకథ వ్రాయబడుతున్నాదని ధ్వని ‘బీజం ధర్మద్రుమస్య ప్రభవతు భవతాం భూతయే రామనామ’ - అనే ప్రారంభములో గోచరిస్తుంది. అదే చిట్టచివర 14వ అంకములోని భరతవాక్యంలో ‘శ్రీమహానాటకం ధత్తే కేవలం బ్రహ్మనిర్మలమ్మని’-వాచ్యంగా ఉపదేశాత్మకంగా చెప్పబడింది. ఇది ఏకవాక్యత ఆనే శాస్త్రీయమైన సంప్రదాయం.